సమాజంలో ఎందరో తన స్వలాభం మరియు స్వార్థ ప్రయోజనాల గురించి చాలా మందిని మోసం చేస్తుంటారు. సమాజంలోని పౌరునిగా దానిని విషాదీకరించి ఏది నలుపు ఏది తెలుపు, ఏది గుర్రం ఏది మైదానం, ఏవి పాలు ఏవి నీళ్లు అని చెప్పే భాధ్యత ఉంది అని నేను భావిస్తాను. నా మనసు మరియు దృష్టి అటువైపు ఉండును. ఎందరో అమాయకులను వారి పబ్బం గడుపుకొనుటకు సమిధలుగా వాడుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. మోసపూరిత ధోరణితో అవసరానికి కరివేపాకు లాగా వాడుకొని వదిలి వేస్తారు. వారి ప్రాణాలతో చేలాగాటాలు ఆడతారు. వారి అమూల్యమైన ఓటు వేసి నాయకుడిని ఎన్నుకుంటే అతడు వీరిని బలి పశువును చేస్తాడు,నిలువునా మోసం చేస్తాడు. కావున ఇట్టి వారిని ఎండగట్ట వలసిన బాధ్యత మన అందరి పై కలదు. యువత మేలుకో. ఇట్టి దుర్మార్గాన్ని నిగ్గు తేల్చి ప్రజల మధ్య జాగృతి ని తీసుకురావాలి. నవ భారతావని పిలుస్తోంది. దాని నిర్మాణ దిశగా అడుగులు వేద్దాం. మన అందరి కర్తవ్యాన్ని పాటించి స్వర్ణ భారత్ ను సాధిద్దాం.
కర్తవ్యమే దేవుడు
ఈ లోకంలో, ప్రపంచములో ఎందరో గురువులు, విద్యావంతులు,మేధావులు, గొప్పవారు. వారందరికి నా నమో సుమాంజలులు. గురువును మించిన దేవుడు లేడు అంటారు. గురువు యొక్క స్థితి అంతటి గొప్పది. అయితే నా పని నాదే. నా కర్తవ్యం నా దేవుడు. దేవుడు నాకు ఉపక్రమించిన పని నేను చేస్తున్నాను. ఇదియే నా ధర్మం, విశ్వాసం. నేను చేయ కల్గిన, నాకు వచ్చిన పని ఇదియే. నాకు కేటాయించబడిన పని కూడా ఇదియే అని నా ఆత్మసాక్షి చెప్పుతున్నది. నేను నలుగురి ప్రకారం yనడుస్తున్నాను ఈ సమాజంలో. కోటి విద్యలు కూటి కొరకు. అదేవిధముగా నాకు వచ్చిన విద్యతో జీవనభృతి సాగిస్తున్నాను. పరివర్తనయే నా ఆయుధం, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రము. ఈ పరివర్తన సదా దేవుని అనుగ్రహముకై నా ప్రయత్నము సాగును. నేను ప్రకృతి ప్రేమికున్ని. ప్రకృతి అంటే నాకు అమితమైన ఇష్టం. ఇలాంటి ప్రకృతికి కారణ భూతుడు, సృష్టికర్త అంటే ఇష్టం ఉండకుండా ఎలా ఉంటాను. అంతా ఆ పరమేశ్వర ప్రసాదం. దేవుని కృప వల్ల నా సంకల్పము నన్ను ముందుకు తీసుకుపోయి కృత కృత్యున్ని చేయును. ఇదియే నాకు దేవునిపై ఉన్న అత్యంత అచంచలమైన నమ్మకం. నేను నిమిత్త మాత్రుడను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
Comments
Post a Comment