Everything is Parameshwara
వ్యాసుడు చెప్పిన విషయం. మనసు నిర్మలం కావాలి, మనసు మలినం వదిలి పెట్టాలి. చింతపండు,ఉప్పు తో పాత్రకు పట్టిన చిలుమును తీసివేసినట్లుగా. పాత్ర ఇదివరకు కూడా బాగానే ఉంది కాని దాని మీద పట్టిన చిలుమును తీసివేశాము. రాగి, ఇత్తడి పాత్రలు. దీనికి సాధనం ధర్మం. మెలకువ తెలువాలి. ఆచారఖాండ తరువాత (మనిషి చనిపోయిన తరువాత కర్మలు )అగ్నిహోత్రం లెక్క ఉందువు. అగ్ని కి బట్ట కట్టలేము. ఈశ్వరుడు శరీరం తో (పట్టుకారు వలే )ఆత్మను పట్టుకొని ఉంటాడు. హృదయ సౌకుమార్యం ను పొందుతారు. కళ లు, సంగీతం దీనిని కల్గిస్తుంది. ఈ శరీరం ఈశ్వరుని వర ప్రసాదం. కావున మన గొప్పతనం ఏమి ఉండదు. దీనిని నశింప చేసేవాడు ఆ ఈశ్వరుడు. అనుష్టించుటకు, పూనిక కావాలి అనగా పూనుకోవడం. తెల్సివుండి నమ్మకపోవడం, తెల్సివుండి, నమ్మకం ఉండి, నమ్మి ఆచరించకపోవడం. ఘోరం, దారుణం. ఉదాహరణ రావణాసురుడు. ధర్మం నశించిన, లేనట్లయితే ఐశ్వర్యం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
Comments
Post a Comment